Sunday, 05 Sep 2010
Home

Mail To Me

link_to_jagan
కాంగ్రెస్ పార్టీతో రక్త సంబంధం : జగన్
ఇటీవల ఖమ్మం జిల్లాలో మరియు రాజమండ్రిలో జరిగిన ఆందోళనలను ఖండిస్తూ శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు " తనకు, తన కుంటుంబానికి కాంగ్రెస్ పార్టీతో వున్న అనుబంధం రక్త సంబంధం కన్నా ఎక్కువని, తన మంచి కోరేవారెవరైనా ఇలాంటి పనులు చేయరని వారు పార్టీకి సంబంధించిన వాళ్ళయితే వెంటనే వారిని  పార్టీ నుండి బహిష్కరించాలని ఒకవేళ వారు పార్టీ వారు కాకపోతే వారిని చట్టపరంగా వెంటనే శిక్షించాలని" కోరారు. అలాగే అధిష్టానం నిర్ణయానికి అందరం కట్టుబడి వుందాం అని, ఎలాంటి ఆందోళనలు మరియు ఆత్మహత్యలకు పాల్పడవద్దని అలాచేస్తే నాన్న గారి ఆత్మశాంతించదని ఆయన అభిమానులు,మద్దతుదారులు మరియు ప్రజలను ఉద్దేశించి అన్నారు.